రేపు వైన్ షాపులు బంద్.. డ్రై డే ప్రకటించిన ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్ / అమరావతి, జనవరి 25: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు (జనవరి 26) వైన్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా జనవరి 26ను “డ్రై డే”గా పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఇప్పటికే పలు వైన్ షాపుల వద్ద “డ్రై డే” బోర్డులను ఏర్పాటు చేశారు.
ఈ రోజున మద్యం విక్రయాలు, సరఫరా పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే సంబంధిత షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
డ్రై డే ముగిసిన అనంతరం జనవరి 27న ఉదయం నుంచి వైన్ షాపులు తిరిగి సాధారణంగా కార్యకలాపాలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

Post a Comment