రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం – 5 నిమిషాల ఆలస్యానికి అనుమతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు Telangana State Board of Intermediate Education (TG BIE) కీలక సూచనలు జారీ చేసింది.
సాధారణంగా హాల్ టికెట్పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉండగా, ఈసారి విద్యార్థులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులకు ఉపశమనం లభించింది.
అలాగే పరీక్ష సమయం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుందని, అయితే 9:05 గంటల వరకు (ఐదు నిమిషాల ఆలస్యం అయినా) పరీక్ష హాలులోకి అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు అవసరమైన స్టేషనరీ సామగ్రిని తీసుకురావాలని, నిషేధిత వస్తువులు తీసుకురావద్దని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని విద్యాశాఖ ఆకాంక్షించింది.

Post a Comment