మందమర్రిలో రోడ్డుప్రమాదం లారీ బోల్తా – ఎవరికి గాయాలు లేవు
మంచిర్యాల జిల్లా మందమర్రిలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మేడారం మహా రెస్టారెంట్ ఎదురుగా ఎల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Post a Comment