బావిలో పడి ముగ్గురు పిల్లలు మృతి
కంగ్టి, మే 6: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెండ్లి సందర్భంగా సొంత ఊరికి వచ్చిన తల్లీకూతుళ్లు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
గ్రామానికి చెందిన పరశురామ్, సావిత్రి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. పరశురామ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బంధువుల వివాహం నేపథ్యంలో వారం రోజుల క్రితం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం సావిత్రి (30), ఆమె కుమార్తెలు నిఖిత (10), నందిని (8) గ్రామ పొలిమేరలోని బావి వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు నందిని ముందుగా బావిలో జారిపడింది. ఆమెను రక్షించేందుకు నిఖిత, సావిత్రి బావిలోకి దిగగా, ముగ్గురూ అందులో చిక్కుకున్నారు.
ఈ ఘటనను గమనించిన మరో కుమార్తె శివానీ గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు బావిలో నుంచి వారిని బయటకు తీసినప్పటికీ అప్పటికే ముగ్గురూ మృతి చెందారు.
మృతుల్లో సావిత్రి, ఆమె కుమార్తె నిఖితతో పాటు మరో బాలిక నందిని కూడా అదే కుటుంబానికి చెందినది. నిఖిత మొగుడంపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో, నందిని సిర్గాపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్నారు. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో బోర్గి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Post a Comment