660 కిలోల బెల్లం ఆబ్కారీ అధికారులు పట్టివేత
660 కిలోల బెల్లం ఆబ్కారీ అధికారులు పట్టివేత
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని లంబాడిహెట్టిలో 660 కిలోల బెల్లాన్ని కాగజ్నగర్ ఆబ్కారీ అధికారులు గురువారం పట్టుకున్నారు. నాటుసారా తయారీదారులకు బెల్లం రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీన పర్చుకున్నట్టు సీఐ రవి తెలిపారు. ఘటనలో నిందితులైన లంబాడిహెట్టి గ్రామానికి చెందిన అజ్మీర సీతారాం, సైరి రమేష్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు.

Post a Comment