ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు అక్కడికక్కడే మృతి
ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు అక్కడికక్కడే మృతి
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బైక్పై వెళ్తున్న నలుగురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన మహిళను రాజమండ్రి ఆస్పత్రి తరలించగా.. మృతదేహాలను మార్చరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!

Post a Comment