ఏలూరు జిల్లాలో తల్లి కొడుకుల దారుణ హత్య?
ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది.
అర్ధరాత్రి తల్లి, కొడుకును దుండగులు హత్య చేశారు. మృతులను గన్నవరానికి చెందిన రొయ్యూరు భ్రమరాంబ (60), సురేష్(21)గా గుర్తించారు.
దుండగులు మెడపై కత్తితో కోసి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాలు ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Post a Comment