రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్: రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రైతు భరోసా అమలుకు సంబంధించి విధివిధానాలను చర్చించారు.
ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే అంశంపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అయితే సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు (టాక్స్ పేయర్స్), ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా స్కీమ్కు అనర్హులుగా ప్రకటించాలని సూచనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై మరింత స్పష్టతకు మరో సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం, సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.

Post a Comment