జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
బిల్లుకు పార్లమెంట్ ఆమోదమే తరువాయి
కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపింది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' నినాదంతో దేశవ్యాప్తంగా ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.
భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి సిఫారసులు సమర్పించింది. ఆ సిఫారసులను పరిశీలించిన అనంతరం కేంద్ర క్యాబినెట్ బిల్లును ఆమోదించింది.
ముఖ్యాంశాలు:
జమిలి ఎన్నికల వల్ల లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరుగుతాయి. ఎన్నికల ఖర్చు తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేయడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశ్యం.
పార్లమెంట్ ఆమోదం పొందిన వెంటనే బిల్లు అమలులోకి రానుంది. ఇదే జరిగితే దేశంలో ఎన్నికల వ్యవస్థలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంటుంది. మరిన్ని విశేషాలు త్వరలో...

Post a Comment