SOT బాలానగర్ టీం మరోసారి గంజాయి చాక్లెట్ గుట్టును రట్టు చేసింది
సైబరాబాద్ SOT బాలానగర్ టీం విశ్వసనీయ సమాచారం మేరకు జగత్గిరిగుట్ట పోలీసులతో కలిసి జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో ఉన్న కిరాణా దుకాణంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో బీహార్కు చెందిన సునీల్ కుమార్ ఝా అనే దుకాణం యజమానిని అదుపులోకి తీసుకుని, 61 ప్యాకెట్లలో దాచిన 2400 గంజాయి చాక్లెట్లు (13 కేజీలు) స్వాధీనం చేసుకున్నారు.
సునీల్ కుమార్ ఝా: 20 సంవత్సరాల క్రితం బీహార్ నుంచి కూలీ పనుల కోసం హైదరాబాద్కు వలస వచ్చాడు.
గంజాయి చాక్లెట్లను బీహార్ నుంచి తెచ్చుకున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం కిరాణా షాప్ ప్రారంభించి, వలస కార్మికులకు ఒక్కో చాక్లెట్ను రూ. 40కి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్ల మొత్తం విలువ రూ.97,600. జగత్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post a Comment