రూ.12,000/- లంచం డిమాండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏసీబీ దాడి అరెస్ట్
తహశీల్దార్ కార్యాలయంలో లంచం.. డేటా ఎంట్రీ ఆపరేటర్ విచక్షణలేని డిమాండ్
సూర్యాపేట, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన బాధ్యత కలిగిన ఉద్యోగులు, లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల తహశీల్దార్ కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకరు అవినీతి ఉదాహరణగా నిలిచారు.
వివరాల్లోకి వెళితే... ఫిర్యాదుదారుడు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని తన పేరుపై మ్యుటేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అవసరమైన ప్రొసీడింగ్ పత్రాలను అతనికి అప్పగించడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ కర్నాటి విజేత రెడ్డి రూ.12,000/- లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు లంచం ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఉండగా, వెంటనే అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు.
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ఈ సమాచారం ఆధారంగా పక్కా ప్రణాళికతో హుజూర్నగర్ తహశీల్దార్ కార్యాలయంలో రెడ్ నిర్వహించింది. ఈ దాడిలో విజేత రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ACB అధికారులు వెల్లడించారు.
ప్రజలకు ACB విజ్ఞప్తి:
ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఎవరైనా లంచం కోరిన సందర్భంలో వెంటనే అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అవినీతిని అరికట్టేందుకు ఈ కింది మార్గాల్లో సమాచారం ఇవ్వవచ్చు:
బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అనే హామీని కూడా అధికారులు ప్రజలకు ఇచ్చారు.
ఇలాంటి చర్యలు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి, అవినీతి నిర్మూలన దిశగా ముందడుగు వేయడానికి సహాయపడతాయని అధికారులు తెలిపారు.
Post a Comment