-->

💥నడిరోడ్డుపై ట్రాన్స్‌జెండర్ల హల్చల్‌.. అడుక్కునే విషయంపై ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి

💥నడిరోడ్డుపై ట్రాన్స్‌జెండర్ల హల్చల్‌.. అడుక్కునే విషయంపై ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి


జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం ఉదయం ట్రాన్స్‌జెండర్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. అడుక్కునే విషయంలో ఉద్రిక్తత మొదలై తీవ్ర ఘర్షణకు దారితీసింది. జగిత్యాల, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన ట్రాన్స్‌జెండర్ వర్గాలు ఒకే ప్రాంతంలో అడుక్కోవడం కారణంగా వాదన మొదలై, తరువాత పరస్పర దాడులకు దారి తీసింది.

నడిరోడ్డుపై ఉదయం పీక టైంలో జరిగిన ఈ సంఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు ప్రయాణికులు, స్థానికులు తలపట్టుకొని నిలిచిపోయారు. వారి మధ్య లాఠీలు, చేతులతో పరస్పరం దాడులు చేసుకుంటుండగా, చుట్టూ ఉన్నవారు గందరగోళానికి లోనయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి తక్షణమే చేరుకుని ఇరువర్గాలను శాంతిపరచే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఇద్దరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రజల రాకపోకలకు విఘాతం లేకుండా చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి, రెండు వర్గాల మధ్య వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. పాత బస్టాండ్ వద్ద పోలీసులు పహరా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Blogger ఆధారితం.