జనగామ పట్టణంలో దొంగల హల్చల్.. అంగన్వాడీ టీచర్ ఇంట్లో భారీ చోరీ
జనగామ పట్టణంలో దొంగల దండయాత్ర కలకలం రేపింది. పట్టణంలోని ఓ అంగన్వాడీ టీచర్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. సమాచారం ప్రకారం, టీచర్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
వీధిలో ఓడిపోయిన తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని, తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డ దుండగులు బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదును ఎత్తుకెళ్లారు. దాదాపు 12 తులాల బంగారం, 60 తులాల వెండి, అలాగే రూ.60,000 నగదు చోరీకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన స్థానికంగా పెద్ద సంచలనం రేపింది. ఇప్పటికే వరుసగా జరుగుతున్న చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా మారుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి ఆధారాల కోసం శోధిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ విచారణను ముమ్మరం చేశారు.
పట్టణంలో పెరుగుతున్న దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళాల్లో పోలీస్ బలగాలను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment