-->

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సబ్-ఇన్స్పెక్టర్‌

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సబ్-ఇన్స్పెక్టర్‌


నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి రక్షకభట నిలయంలో అధికారికంగా డ్యూటీలో ఉన్న సబ్-ఇన్స్పెక్టర్ జమాలపురి రాంచందర్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల చేతికి చిక్కారు.

ఫిర్యాదుదారునిపై ఇదివరకే కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ.10,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి సమాచారంపై స్పందించిన అనంతరం, అధికారులు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి:

ఏ ప్రభుత్వాధికారి లేదా ఉద్యోగి లంచం కోరిన సందర్భంలో, ప్రజలు దిగ్విజ్ఙప్తిగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అదేవిధంగా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), లేదా అధికారిక వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

👉 ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Blogger ఆధారితం.