-->

చెన్నూర్ నియోజకవర్గంలో కార్మికశాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు

చెన్నూర్ నియోజకవర్గంలో కార్మికశాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు


చెన్నూర్ నియోజకవర్గంలో కార్మికశాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రజలకు భరోసానిచ్చారు. మంత్రి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చెన్నూర్ మున్సిపాలిటీలో రూ.34 లక్షల నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులకు రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పాత బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రైతు భరోసా సంబురాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
అలాగే, చెన్నూర్ మండలంలోని సుబ్బరాంపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం విశేషం.

తర్వాత భీమా రూరల్ ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ.66 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు డార్మెటరీ గదులకు శంకుస్థాపన చేశారు. అదే సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ (అనుమతి పత్రాలు) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "చెన్నూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.200 కోట్ల రూపాయల నిధులతో విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిరోజూ మార్నింగ్ వాక్ లో ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటున్నాను. వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నాను. అభివృద్ధి పరంగా చెన్నూర్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడాలి" అని చెప్పారు.


Blogger ఆధారితం.