-->

పేకాట స్థావరంపై మందమర్రి పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

రూ. 38,150 నగదు, 6 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం


మందమర్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న సంఘటనపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారివద్ద నుంచి రూ.38,150 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిని మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ ఘటనపై ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ "పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అధికారి ఆదేశాల మేరకు, పక్కా సమాచారం ఆధారంగా శాంతినగర్‌లో గల శివ అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్న స్థావరాన్ని గుర్తించి దాడి చేశాం. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశాం. అంతేకాకుండా, తన ఇంటిని పేకాట స్థావరంగా ఉపయోగించుకునేందుకు అనుమతించిన ఇంటి యజమాని శివపై కూడా చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.

అరెస్టైన నిందితుల వివరాలు:

  1. కట్టా దుర్గారావు (40), పాలచెట్టు ఏరియా, మందమర్రి
  2. దాసరి నర్సయ్య (45), బూడిదగడ్డ బస్తీ, బెల్లంపల్లి
  3. పుడమ శివ (28), విద్యానగర్, మందమర్రి
  4. గరిక కుమార్ (30), పూల వ్యాపారి, విద్యానగర్
  5. మేకల రాజశేఖర్ (25), కూలీ, రామన్ కాలనీ
  6. కట్టా రమణ (45), పూల వ్యాపారి, మారుతి నగర్
  7. తన్నీరు రవి (30), కూలీ, విద్యానగర్

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

  • నగదు: ₹38,150/-
  • సెల్‌ఫోన్లు: 6
  • ద్విచక్ర వాహనాలు: 2

ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రాజశేఖర్, ఏఎస్ఐ మిలింద్ కుమార్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, విశ్వనాథ్, కృష్ణ, చైతన్యలను సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి అభినందించారు. చట్టవ్యతిరేక చర్యలపై గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.