8 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన నల్లగొండ ఫైర్ అధికారి
నల్లగొండ జిల్లా: బాణసంచా దుకాణం నడపడానికి తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుడి నుండి రూ.8,000/- లంచం స్వీకరించిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి ఎ. సత్యనారాయణ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం పట్టుకున్నారు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు తాత్కాలిక లైసెన్స్ కోసం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ ప్రక్రియను వేగవంతం చేయాలంటే రూ.8,000/- లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎసీబీ అధికారులు ఉచ్చు వేసి, సత్యనారాయణ రెడ్డిని లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.
ఎసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే "టోల్ ఫ్రీ నంబర్ 1064"కు కాల్ చేయాలని కోరారు. అంతేకాకుండా, వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Post a Comment