గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో దారుణం.లివర్ ట్రాన్స్ప్లాంట్ 85 లక్షల బిల్లు
లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం చేరిన రోగి కుటుంబం దారుణ అనుభవం
హైదరాబాద్, అక్టోబర్ 12: గచ్చిబౌలి లోని ప్రైవేటు AIG ఆసుపత్రిలో మరోసారి ఆసుపత్రి బిల్లుల దందా బహిర్గతమైంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
మూలాల ప్రకారం, రోగి కుటుంబం ఆసుపత్రి అధికారులతో రూ.35 లక్షల ప్యాకేజీకి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, చికిత్స పూర్తయిన తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు రూ.85 లక్షల బిల్లు వేశారు. ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిన కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది.
అయితే, బిల్లు చెల్లించిన కొద్దిసేపటికి రోగి మరణించాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. అంతేకాదు, రోగి రెండు రోజుల క్రితమే మరణించి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం, బిల్లుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
👉 ప్రైవేటు ఆసుపత్రులలో బిల్లుల దోపిడీపై మళ్లీ ప్రశ్నలు లేవుతున్నాయి...
Post a Comment