మొంథా తుపాన్పై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుపాన్ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
👉 ముఖ్య ఆదేశాలు:
- వరి కోతల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
- ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో వర్షం ప్రభావం ఉండకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
- ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిక.
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం.
- చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, కాజ్వేలపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు.
- అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి అధికారులు ప్రజలతో నిరంతర సంబంధం కొనసాగిస్తూ తుపాన్ ప్రభావాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Post a Comment