వ్యక్తికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 10 వేలు జరిమానా
కొత్తగూడెం లీగల్ :: కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ బుధవారం తీర్పు వెలువరించారు. మాచర్ల ఏసుబాబు అనే వ్యక్తికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.
గత కొద్దికాలంగా రాజేశ్వరి, ఎదురింటి వ్యక్తి మాచర్ల ఏసుబాబుతో తరచూ ఫోన్లో మాట్లాడుతోందని భర్త అశోక్ అనుమానం వ్యక్తం చేశాడు. పెద్దల సలహా మేరకు మధ్యవర్తిత్వం జరిగినా, సంబంధం నిలవలేదు. అశోక్కు అనుమానం మరింత బలపడటంతో, 2019 నవంబర్ 5న భార్యపై దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అశోక్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజేశ్వరి రక్తపు మడుగులో పడిఉండగా, కుటుంబసభ్యులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పిప్పళ్ళ సుమంత్ ఫిర్యాదు మేరకు పాల్వంచ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై జి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ జరుపుల రవి సహకరించారు.

Post a Comment