20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీరు
వనపర్తి: ఫిర్యాదుదారుని బంధువుకి చెందిన వ్యవసాయ భూములకు డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్) మంజూరు చేయాలన్న పేరుతో లంచం డిమాండ్ చేసిన టీజీఎస్పిడిసిఎల్ అధికారిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.
గోపాల్పేట సెక్షన్కు చెందిన సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి డిటిఆర్ ఏర్పాటుకు మొత్తం రూ.40,000/- లంచం అడిగినట్లు ఏసీబీ తెలిపింది. అందులో భాగంగా రూ.20,000/- స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఎలాంటి ప్రభుత్వ సేవకుడు లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధకశాఖను సంప్రదించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నెంబర్:
📞 1064
అలాగే క్రింద ఇచ్చిన సోషల్ మీడియాలో కూడా సమాచారాన్ని అందించవచ్చు:
• WhatsApp: 9440446106
• Facebook: Telangana ACB
• X (Twitter): @TelanganaACB
• Website: acb.telangana.gov.in
ఏసీబీ అధికారులు వెల్లడించినట్లు, “ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.”

Post a Comment