మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ… ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ దళపతి హిడ్మా మృతి!
ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో హిడ్మా భార్యతో పాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే పూర్తి సమాచారం కోసం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అటవీ ప్రాంతంలో భారీ కూబింగ్ – సమాచారం దొరకడంతో ఆపరేషన్ వేగం
మారేడుమిల్లి లోతట్టు అరణ్యాల్లో అగ్ర మావోయిస్టు నాయకులు తలదాచుకున్నారన్న నిఘా సమచారం భద్రతా దళాలకు అందింది. దీని నేపథ్యంలో సీఆర్పీఎఫ్, గ్రేల్హౌండ్స్ దళాలు భారీ ఎత్తున అటవీలో కూబింగ్ నిర్వహించాయి. ఇదే సమయంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
హిడ్మా – దండకారణ్యాన్ని కుదిపేసిన గెరిల్లా వ్యూహకర్త
- హిడ్మాపై ప్రకటించిన ఇనామం రూ. 1 కోటి
- ఆయన భార్యపై రూ. 50 లక్షలు
- 2017లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న దాడికి హిడ్మానే ప్రధాన నేరస్తుడు
చత్తీస్గఢ్లో జరుగుతున్న భద్రతా దళాల ఆపరేషన్ల వల్ల ఒత్తిడి పెరగడంతో, హిడ్మా బృందం మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుందని పోలీసులకు ముందుగానే సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
ఇంకా కొనసాగుతున్న కూబింగ్… పరిస్థితి ఉద్రిక్తం
ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంకా కూబింగ్ కొనసాగుతోంది. ఏమైనా మావోయిస్టులు పరారై ఉండవచ్చన్న అనుమానంతో అడవిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇద్దరి మధ్య కాల్పులు కొన్నిసేపు కొనసాగినట్లు కూడా అధికారులు తెలిపారు.

Post a Comment