నల్లగొండ జిల్లా – చిట్యాలలో మైనర్పై అబార్షన్ ప్రయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వెటర్నరీ హాస్పిటల్ నిర్వాహకులపై కేసు నమోదు
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో మైనర్ అమ్మాయికి అక్రమంగా అబార్షన్ చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సాయి తేజ వెటర్నరీ హాస్పిటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం— మైనర్ అమ్మాయిని గర్భవతిని చేసిన మైనర్ అబ్బాయిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
బాధిత సరస్వతిని సఖి సెంటర్లో ఐసిడీఎస్ పర్యవేక్షణలో ఉంచినట్లు నార్కట్పల్లి సర్కిల్ సీఐ నాగరాజు తెలిపారు. అదేవిధంగా అక్రమ గర్భసంప్రదాయానికి సంబంధించిన వివరాలు పరిశీలించేందుకు సంబంధిత స్కానింగ్ సెంటర్ల సమాచారాన్ని డీఎంహెచ్ఓకు పంపించినట్లు పేర్కొన్నారు. విచారణ పూర్తి అయిన తర్వాత తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment