సార్ కొట్టాడ’’నే ఆవేశంతో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ‘‘సార్ కొట్టాడ’’నే ఆవేశంతో ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
వివరాల్లోకి వెళ్తే — వీణవంక మండలానికి చెందిన చరణ్ కుమార్ మరియు రామ్ చరణ్ అనే విద్యార్థులు జమ్మికుంటలోని ఎస్వీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఒక ఉపాధ్యాయురాలు వీరి ప్రవర్తనపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో, ప్రిన్సిపాల్ ఇద్దరినీ మందలించి కొట్టారని విద్యార్థులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.
ఆవేశంతో ఇంటికి వెళ్తూ ఇద్దరూ పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను కొట్టిన ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించగా, ఘటన అనంతరం ప్రిన్సిపాల్ మాత్రం అందుబాటులో లేరని తెలుస్తోంది. పిల్లల ప్రాణాలు పణంగా పెట్టే వరకు పరిస్థితులు దిగజారడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment