పత్తి రైతుపై మరో పిడుగు… కేంద్ర రూల్స్కు నిరసనగా ఇవాళ్టి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్
హైదరాబాద్: వరుస వర్షాలు, తుపాన్లతో పత్తి పంట నష్టపోయి తేరుకుంటున్న రైతులపై మరో పిడుగుపడింది. పత్తి కొనుగోళ్లలో కేంద్ర సంస్థ సీసీఐ అవలంబిస్తున్న కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి (నవంబర్ 17) రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించాయి. దీంతో పత్తి మార్కెట్లు మరోసారి సంక్షోభంలోకి వెళ్లాయి.
సీసీఐ కొత్త నిబంధనలు రైతులు–మిల్లర్లకు ఇబ్బందే
మిల్లర్ల వినతులను పరిగణించకుండా సీసీఐ కఠిన నిర్ణయాలు కొనసాగిస్తుండటంతో నిరసనగా బంద్ తప్పనిసరి అయిందని సంఘం ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతులకు స్మార్ట్ఫోన్లు లేకపోవడం వల్ల యాప్ రిజిస్ట్రేషన్ పెద్ద అడ్డంకిగా మారింది.
పంటనష్టం… తేమ సమస్య… ఇప్పుడు మిల్లుల బంద్
తాజా మోంథా తుఫాన్, అకాల వర్షాలతో రాష్ట్రంలో 1,51,707 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో భారీ నష్టం నమోదైంది.
సీసీఐ కొనుగోళ్లు చాలా తక్కువ
మొత్తం పత్తిలో ఇది చాలా తక్కువ శాతం. దాంతో రైతులు ప్రైవేట్ మార్కెట్పై ఆధారపడాల్సిన పరిస్థితి.
రోజుకో నిబంధన – రైతులకు పెనుభారం
“ఎల్–1, ఎల్–2 విధానాలు అన్యాయం… మిల్లులు నడవాల్సిందే”
– బొమ్మినేని రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
“ఎల్–1, ఎల్–2 విధానాలు పూర్తిగా అన్యాయం. సమస్యల గురించి ఎన్నిసార్లు తెలిపినా సీసీఐ స్పందించలేదు. ఈ నిర్ణయాలు కొనసాగితే జిన్నింగ్ పరిశ్రమే మూతపడే ప్రమాదం ఉంది. అందుకే బంద్ తప్పలేదు” అని తెలిపారు.

Post a Comment