భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 1 : కోర్టు కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకపాత్ర పోషిస్తుందని, న్యాయవాదులు దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయమూర్తి పి. వసంత్ సూచించారు.
శనివారం జిల్లా న్యాయవాదుల లైబ్రరీ హాల్లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA) ఆధ్వర్యంలో “కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం ప్రాముఖ్యత” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఫోరెన్సిక్ సాక్ష్యంపై విస్తృత అవగాహన అవసరం
ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రో-బ్లాక్ డైరెక్టర్ మోహన్ ఎర్రగోళ్ల మాట్లాడుతూ, భారత సాక్ష్య చట్టంలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రాధాన్యతను వివరించారు. నేటి రోజుల్లో ఫోరెన్సిక్ పరిశోధనలు న్యాయనిర్ణయాలలో కీలకమని ఆయన తెలిపారు.
అలాగే న్యాయవాదులు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను ప్రస్తావిస్తూ, పాలిగ్రఫీ టెస్ట్, ఫింగర్ప్రింట్ అనాలసిస్, నార్కో అనాలసిస్, హ్యాండ్రైటింగ్ అనాలసిస్, సంతకం ధృవీకరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన అవసరమని వివరించారు.
విశిష్ట అతిథులు, హాజరైన న్యాయవర్గం
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత, న్యాయమూర్తులు ఎం. రాజేందర్, కె. కిరణ్కుమార్, కె. కవిత, కె. సాయిశ్రీ, స్పెషల్ జ్యుడిషియల్ సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తదితరులు హాజరయ్యారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్లు జే. గోపికృష్ణ, సుంకర భానుప్రియ, సీనియర్ న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, జే. శివరామ్ ప్రసాద్, విజయ్ భాస్కర్ రెడ్డి, పి. నాగేశ్వరరావు, గంట వీరభద్రం, కిలారు పురుషోత్తం, గాజుల రామమూర్తి, బి. చిరంజీవి, నల్లమల ప్రతిభ, లక్ష్మీ సరిత, కాసాని రమేశ్, సహానజు పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా అడపాల మహాలక్ష్మి, యెర్రా కామేష్, సాధిక్ పాషా, ఎర్రపాటి కృష్ణ, మారపాక రమేష్, అంబటి రమేష్, దొడ్డా సామంత్, మేకల దేవేందర్, పాల రాజశేఖర్, పగిడిపల్లి శ్రీకాంత్, వడ్లకొండ హరిప్రసాద్, ఇందిరా ప్రియదర్శిని, బేబీ షామిలి, దారావత్ రాధాకృష్ణ, యాస యుగేందర్ తదితర న్యాయవాదులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ⚖️
Post a Comment