మొదటి విడత పంచాయతీ ముగిసిన ఎన్నికల ప్రచారం
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ముగిసింది. ఎల్లుండి (మొదటి విడత) పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.
🔹 తొలి విడత వివరాలు
- మొదటి విడతలో మండలాలు: 189
- గ్రామ పంచాయతీలు: 4,235
- పోలింగ్ కేంద్రాలు: 37,562
🗳️ ఓటర్ల సంఖ్య
మొత్తం ఓటర్లు: 56,19,430
- పురుషులు: 27,41,070
- మహిళలు: 28,78,159
- ఇతరులు: 201
📊 పోలింగ్ అనంతరం
- అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్
- వెంటనే ఫలితాల వెల్లడింపు
🍶 డ్రై డే అమల్లో
ఎన్నికల నియమావళి ప్రకారం ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి – ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు పూర్తిగా బంద్.
🟩 ఏకగ్రీవ పంచాయతీలు
ప్రచారం ముగిసే సమయానికి తొలి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు.

Post a Comment