10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన హౌసింగ్ ఏఈ
ఆదిలాబాద్, జనవరి 27: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్ లంచం కేసులో ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఫిర్యాదుదారుడి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, అలాగే నిర్మాణ బిల్లులు మంజూరు చేయడానికి రూ.10,000 లంచం ఇవ్వాలని దుర్గం శ్రీకాంత్ డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలోనే అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు భయపడకుండా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
- టోల్ ఫ్రీ నెంబర్: 1064
- వాట్సాప్: 9440446106
- ఫేస్బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment