మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు, నో రిజర్వేషన్.. 4 వేల ప్రత్యేక బస్సులు!
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. ఈ నెల జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు జాతర ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యంగా ఉండేలా దక్షిణ మధ్య రైల్వేతో పాటు టీజీఎస్ఆర్టీసీ కీలక ఏర్పాట్లు చేసింది.
28 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు
ప్రత్యేక రైళ్ల వివరాలు:
- సికింద్రాబాద్ – మంచిర్యాల (3 సర్వీసులు)
- మంచిర్యాల – సికింద్రాబాద్ (3 సర్వీసులు)
- సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ (2)
- సిర్పూర్ కాగజ్నగర్ – సికింద్రాబాద్ (2)
- నిజామాబాద్ – వరంగల్ (4)
- వరంగల్ – నిజామాబాద్ (4)
- కాజీపేట – ఖమ్మం (4)
- ఖమ్మం – కాజీపేట (4)
- ఆదిలాబాద్ – కాజీపేట (1)
- కాజీపేట – ఆదిలాబాద్ (1)
ఈ రైళ్లు మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, ఆలేరు, జనగామ, ఘనాపూర్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీ నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు
ఈ ప్రత్యేక బస్సులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది.
మేడారంలో విస్తృత ఏర్పాట్లు
- 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్
- 9 కిలోమీటర్ల పొడవున 50 క్యూ లైన్లు
- ఒకేసారి 20 వేల మంది నిలబడే అవకాశం
- ప్రయాణికుల కోసం రెస్ట్రూములు, కుర్చీలు, తాగునీరు
- 26 ఎకరాల్లో బస్సుల పార్కింగ్ సదుపాయం
మహిళలకు ఉచిత ప్రయాణం
మేడారం జాతరకు వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Post a Comment