-->

హృదయ విదారక ఘటన.. వేడి సాంబార్‌లో పడి చిన్నారి మృతి

హృదయ విదారక ఘటన.. వేడి సాంబార్‌లో పడి చిన్నారి మృతి


ఖమ్మం: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో గుండెను కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. సింహాద్రి–సరోజినీ దంపతుల ఆరేళ్ల కుమార్తె రమ్యశ్రీ ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.

ఇంట్లో వంట పనులు జరుగుతున్న సమయంలో రమ్యశ్రీ పక్కనే ఆడుకుంటూ ఉండగా జారి వేడి సాంబార్ ఉన్న పాత్రలో పడింది. తీవ్రంగా కాలిన గాయాలతో చిన్నారి ఆర్తనాదాలు చేయగా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందింది.

ఈ ఘటనతో ఇందిరమ్మ కాలనీ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లిదండ్రుల ఆవేదన చూసి అక్కడున్నవారు కన్నీటిపర్యంతమయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793