డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శిగా కొనసాగుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా స్వచ్ఛందంగా లొంగుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని Telangana Police ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయినవారికి ప్రభుత్వ పునరావాస విధానాల ప్రకారం అవసరమైన సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఇంకా అడవుల్లో ఉన్న ఇతరులు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు.

Post a Comment