నిర్మల్లో విషాదం: ఫ్రిడ్జ్ షార్ట్సర్క్యూట్తో ఇద్దరి మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడలోని ఓ ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్లో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనతో మహాలక్ష్మి వాడలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. షార్ట్సర్క్యూట్ ఎలా జరిగింది? మరిన్ని కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment