ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవుల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవుల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, జూలై 15: ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గతంలో మంచి పనితీరు కనబరిచిన నాయకులకు మరోసారి అవకాశం కల్పించేలా రెన్యువల్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. పార్టీ పదవుల అంశంపై ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించినట్లు చెప్పారు.
మండల కమిటీల ఏర్పాటు విషయంలో డీసీసీ అధ్యక్షులు పంపిన నివేదికలే తుది నిర్ణయానికి ఆధారమవుతాయని స్పష్టం చేశారు. మంచి పనితీరు కనబరిచిన వారిని కొనసాగించే అవకాశం ఉందని, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే డీసీసీ అధ్యక్షుల్లో మార్పులు కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.
ఇంకా రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ, సంస్థాగత అంశాలపై చర్చిస్తానని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
స్థానిక సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన, ప్రతి చిన్న విషయానికీ గాంధీ భవన్కు రావడం మానుకోవాలని క్యాడర్కు సూచించారు.

Post a Comment