సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ దీక్షను ఢిల్లీ పోలీసులు శనివారం భగ్నం చేసి, ఆయనను ఆస్పత్రికి తరలించారు. విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దాదాపు 9 కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది.
హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనల మేరకు పోలీసులు శనివారం ఉదయం వాంగ్చుక్ను దీక్షా శిబిరం నుంచి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడున్న నిరసనకారులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు భద్రత మధ్య సోనం వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించారు.

Post a Comment