జాతీయ సమైక్య శిబిరానికి ఎంపికైన ఎల్బీ కళాశాల ముగ్గురు NCC క్యాడెట్లు
జాతీయ సమైక్య శిబిరానికి ఎంపికైన ఎల్బీ కళాశాల ముగ్గురు NCC క్యాడెట్లు
హనుమకొండ: హనుమకొండ పట్టణంలోని ఎల్బీ కళాశాలకు చెందిన ముగ్గురు NCC క్యాడెట్లు జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల హెచ్ఎం డా. అరుణ వెల్లడించారు.
ఈ జాతీయ సమైక్యత శిబిరం 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. శిబిరంలో క్యాడెట్లు తమ ప్రతిభను చాటుతూ కళాశాలకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్యాడెట్లను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో NCC కెప్టెన్ సదానందం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment