ఎన్ఐటీ వరంగల్లో సీటు సాధించిన విద్యార్థికి కేటీఆర్ ల్యాప్టాప్ బహుమతి
ఎన్ఐటీ వరంగల్లో సీటు సాధించిన విద్యార్థికి కేటీఆర్ ల్యాప్టాప్ బహుమతి
సిరిసిల్ల, ఆగస్టు 13: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి మణిదీప్ ప్రతిష్టాత్మక ఎన్ఐటీ వరంగల్లో మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులో సీటు సాధించాడు. ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచి ఎన్ఐటీ వరంగల్లో ప్రవేశం పొందిన మణిదీప్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం మణిదీప్ను కేటీఆర్ ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి విద్యాభ్యాసం, ఎన్ఐటీ వరంగల్లో లభించిన సీటు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఉన్నతంగా చదివి మంచి స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మణిదీప్కు కేటీఆర్ ల్యాప్టాప్ను బహుమతిగా అందజేశారు. ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదువుతున్న మణిదీప్కు ల్యాప్టాప్ విద్యాభ్యాసంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
తమ గ్రామానికి చెందిన విద్యార్థి ఎన్ఐటీ వరంగల్లో సీటు సాధించడం పట్ల వన్పల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మణిదీప్ మరింత కష్టపడి చదివి ఇంజినీరింగ్ విద్యలో రాణించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్ అందుకోవడం మణిదీప్కు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని స్థానికులు పేర్కొన్నారు.

Post a Comment