వైన్షాప్ నిర్వాహకుల ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్లో ఉద్రిక్తత
వైన్షాప్ నిర్వాహకుల ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్లో ఉద్రిక్తత..
మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహులపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధుర వైన్షాప్ ఎదుట బెల్ట్షాప్ నిర్వహిస్తున్న దంపతులు యాకయ్య, స్వాతి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తమ బెల్ట్షాప్పై అబ్కారీ శాఖ అధికారులు దాడి చేసి సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని దంపతులు ఆరోపించారు. వైన్షాప్ అనుమతితోనే తాము మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని వారు తెలిపారు.
అధికారుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దంపతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

Post a Comment