తెలంగాణ ప్రభుత్వం: రైతు కూలీలకు శుభవార్త
– 10 లక్షల మందికి ఆత్మీయ భరోసా!
హైదరాబాద్: భూమి లేని కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా నూతన భరోసా కల్పించబోతోంది. ఈ పథకాన్ని జనవరి 26 నుండి ప్రారంభించనున్నారు.
స్కీమ్ ముఖ్యాంశాలు:
- ఏడాదికి రెండు విడతల్లో మొత్తం రూ. 12,000 లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయబడతాయి.
- వ్యవసాయ భూమి లేని, ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన వారు అర్హులు.
- ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పని చేసిన వారు ఈ పథకానికి అర్హులుగా గుర్తింపు పొందుతారు.
- పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది.
10 లక్షల లబ్ధిదారులు:
రాష్ట్రంలో 53.07 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 29 లక్షల మందికి భూమి లేదని గుర్తించారు. వీరిలో 10 లక్షల కుటుంబాలు పథకానికి అర్హులుగా గుర్తించబడ్డాయి. ప్రతి పంట సీజన్కు రూ. 6,000 చొప్పున వారికి సాయం అందిస్తారు.
సగటు కూలీకి సమానమైన మద్దతు:
2005లో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం క్రమంలో లక్షలాది మంది ఉపాధి పొందారు. ఇప్పుడు ఆ జాబ్ కార్డుదారులకు ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఏడాదికి రూ. 12,000 అందచేస్తోంది.
- ఉపాధి హామీ పథకం ప్రకారం, కూలీలకు రోజుకు గరిష్టంగా రూ. 230 చెల్లింపు ఉంటుంది.
- సగటు కూలీ రూ. 200 వరకు పొందుతున్నారు.
- వంద రోజుల పని హాజరయ్యే కూలీలు చాలా తక్కువగా ఉండటంతో ఈ స్కీమ్ వారికి అదనపు భరోసాగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం ద్వారా భూమి లేని కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Post a Comment