భూ భారతిలో అప్లై చేసుకోవడం ఎలా?
1. వీలునామా / వారసత్వం ఆధారంగా మ్యుటేషన్:
-
ఎక్కడ అప్లై చేయాలి?
భూభారతి పోర్టల్లో తహసీల్దార్కు దరఖాస్తు చేయాలి. -
ఏం జత చేయాలి?
- వీలునామా లేదా వారసత్వ ఆధారాల డాక్యుమెంట్లు
- ఇంటెస్టేట్ వారసత్వం అయితే – వారసులందరి నుంచి జాయింట్ అఫిడవిట్
- సర్వే / సబ్డివిజన్ మ్యాప్
-
ప్రాసెస్ ఎలా ఉంటుంది?
- తహసీల్దార్ నోటీసులు జారీ చేసి, గ్రామ పంచాయతీ, తహసీల్ కార్యాలయంలో ప్రకటన వేస్తారు
- 7 రోజుల్లో ఆధారాలతో అఫిడవిట్ సమర్పించాలి
- ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తారు
- 30 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ వస్తుంది
- ఆర్డర్ రాకపోతే – దరఖాస్తుదారు పేరు డీమ్డ్ మ్యుటేషన్గా పరిగణిస్తారు
- ఆమోదమైతే – కొత్త / అప్డేట్ చేసిన పట్టాదార్ పాస్బుక్ వస్తుంది
2. రికార్డుల్లో సవరణ చేయించుకోవడం:
-
ఎప్పుడు అప్లై చేయాలి?
- చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపల
- లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపల
-
ఏం జత చేయాలి?
- పట్టాదార్ పాస్బుక్
- టైటిల్ డీడ్
- పహాణీ
- రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు
- అఫిడవిట్
-
ప్రాసెస్ ఎలా ఉంటుంది?
- సంబంధిత అధికారులు – దరఖాస్తుదారుకూ, రికార్డుల్లో ఉన్న వ్యక్తులకూ, ఇతర హక్కుదారులకూ నోటీసులు ఇస్తారు
- 7 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి
- అభ్యంతరాలు లేకపోతే, ఆధారాలపై నిర్ణయం తీసుకుంటారు
- ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు
- 60 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు
- ఆర్డర్ను పోర్టల్లో చూపించి, పార్టీలకు తెలియజేస్తారు.

Post a Comment