వియత్నాంలో దుర్ఘటన – తెలంగాణ విద్యార్థి మృతి (వీడియో)
వియత్నాంలోని కాంతో నగరంలో జరిగిన విషాద ఘటనలో తెలంగాణకు చెందిన యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన అర్షిద్ అష్రిత్ (21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి ప్రమాదవశాత్తూ మరణించాడు.
కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారిగా పనిచేస్తున్న అర్షిద్ అర్జున్, ప్రతిమ దంపతుల కుమారుడైన అష్రిత్, వైద్య విద్య కోసం వియత్నాంలోని కాంతో సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
అయితే జూన్ 4వ తేదీ తెల్లవారుజామున అష్రిత్ తన స్నేహితుడితో కలిసి 150సీసీ బైక్పై వేగంగా ప్రయాణించగా, అదుపుతప్పిన బైక్ ఒక ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో అష్రిత్ తలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో ఉన్న మరొక యువకుడికి తీవ్రమైన గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్త తెలియగానే అష్రిత్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడి ఆకస్మిక మృతితో కుటుంబంలో తీరని శోకం నెలకొంది. అష్రిత్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులు అధికారులు, ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నారు.
ఈ సంఘటనతో కాగజ్నగర్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువుకోసం విదేశాలకు వెళ్లిన యువకుడు అకాలంలో అర్ధాంతరంగా మృతి చెందడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
Post a Comment