CBSE పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పు ఇకపై ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు
ఢిల్లీ, సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు 2026 సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
CBSE పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం:
- మొదటి విడత పరీక్షలు: ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతాయి.ఇది తప్పనిసరి పరీక్షగా ఉంటుంది.
- రెండవ విడత పరీక్షలు: మే నెలలో నిర్వహిస్తారు.ఇది ఐచ్ఛిక పరీక్షగా ఉంటుంది. విద్యార్థులు ఫిబ్రవరిలో తక్కువ మార్కులు సాధించినట్లయితే, మేలో మరొక అవకాశం పొందేలా ఈ విధానం రూపొందించబడింది.
ఈ విధానం జాతీయ విద్యా విధానం (NEP) సూచనల మేరకు తీసుకున్న నిర్ణయమని అధికారులు వెల్లడించారు.
- ఫలితాల విడుదల తేదీలు:
- ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత ఫలితాలు ఏప్రిల్లో
- మేలో నిర్వహించే రెండవ విడత ఫలితాలు జూన్లో విడుదలవుతాయని CBSE పేర్కొంది.
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత సానుకూలంగా మారుతుందని, వారు ఒత్తిడిలో కాకుండా సానుకూలతతో పరీక్షలకు హాజరయ్యే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.
Post a Comment