అహ్మదాబాద్ విమాన ప్రమాదం – ప్రాణాలతో బయటపడ్డ ఏకైక yolk విశ్వాస్ కుమార్
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయిన కేవలం 30 సెకన్లలోనే విమానం భారీ శబ్దంతో కుప్పకూలింది. ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
✈️ విమాన శకలాల మధ్య నుండి బయటపడ్డ వ్యక్తి ఎవరు?
విమాన శకలాల మధ్య నుండి తీవ్ర గాయాలతో బయటపడిన వ్యక్తిని పోలీసులు విశ్వాస్ కుమార్ రమేష్ (వయస్సు 40)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అధికారికంగా ధృవీకరించారు.
🗣️ బాధితుడు విశ్వాస్ కుమార్ ఏమన్నాడంటే...
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ మాట్లాడుతూ,
“విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకన్లలోనే ఒక భారీ శబ్ధం వినిపించింది. ఒక్కసారిగా భూమిపైకి పడిపోయింది. నేను లేచి చూడగానే చుట్టూ అన్నీ విమాన శకలాలే. నా తమ్ముడు కూడా విమానంలోనే ఉన్నాడు. అతన్ని వెతకండి… నేను బ్రిటన్ పౌరుడిని. గత 20 ఏళ్లుగా లండన్లో నివసిస్తున్నాను. కుటుంబాన్ని కలవడానికి భారత్ వచ్చాను. మృత్యువును చూస్తూ బ్రతికినంత మాత్రాన గుండె ధైర్యంగా లేదు…” అని కన్నీటి పర్యంతమయ్యాడు.
🆘 ఎమర్జెన్సీ గేట్ నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్న వీరుడు
ప్రధమ సమాచారం మేరకు ప్రమాదం సంభవించిన వెంటనే ఎమర్జెన్సీ గేట్ తెరిచి విశ్వాస్ కుమార్ బయటకు దూకినట్లు తెలుస్తోంది. విమానం భూతళంపై కూలిన క్షణాలలోనే అతను ఈ ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇది ఒక అద్భుతమైన జీవన పోరాటం అని వైద్యులు మరియు పోలీసులు పేర్కొన్నారు.
🚨 మరికొంత సమాచారం కోసం వేచి చూడాలి...
ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిగిలిన ప్రయాణికుల పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. బాధితుల వివరాలు సేకరించేందుకు, చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ తో పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

Post a Comment