మందమర్రి K.K.5 గనిలో ప్రమాదం… జనరల్ అసిస్టెంట్ శ్రావణ్ మృతి
మందమర్రి ఏరియాలోని K.K.5 గనిలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రెండవ షిఫ్ట్లో (2వ షిఫ్ట్) సైడ్ ఫాల్ (గనిలో ప్రక్క గోడ కూలిపోవడం) జరిగిన ఘటనలో శ్రావణ్ అనే జనరల్ అసిస్టెంట్ (SDL Acting Operator) మృతి చెందాడు.
ప్రమాద సమయంలో శ్రావణ్ విధుల్లో నిమగ్నమై ఉన్నాడు. అకస్మాత్తుగా గని లోపల భద్రమైన ప్రక్కభాగం కూలిపోవడంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. సహచర కార్మికులు మరియు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై గనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గని కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మృతుడి కుటుంబానికి మానవతా దృక్పథంతో మద్దతు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Post a Comment