తెలంగాణలో పిడుగులు పడి 8 మంది రైతుల మృతి
హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో పిడుగులు పడటంతో మూడు జిల్లాల్లో ఎనిమిది మంది రైతులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
వివరాల ప్రకారం, నిర్మల్ జిల్లాలో ముగ్గురు, జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆకస్మికంగా పడిన పిడుగులు రైతులను బలితీసుకున్నాయి.
హైదరాబాద్లోనూ తక్కువ సేపు భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
ఈ వర్షాలను తేలికగా తీసుకోవద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
ప్రజలు వర్షాకాలంలో పొలాల్లో పనిచేసేటప్పుడు, చెట్ల కింద నిలబడకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.

Post a Comment