పాంగోలిన్ స్కేల్స్ అక్రమ రవాణా ముఠా అరెస్ట్ డీఆర్ఐ అధికారుల సోదాలు
హనుమకొండ : పాంగోలిన్ (అలుగు) పొలుసుల అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ యూనిట్ అధికారులు ఆదివారం హనుమకొండలో దాడి చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 6.53 కిలోల పాంగోలిన్ స్కేల్స్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు అడవుల్లో అలుగులను వేటాడి వాటి చర్మంపై ఉండే పొలుసులను వేరు చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ పొలుసులకు ఆగ్నేయాసియా దేశాల్లో భారీ డిమాండ్ ఉండటంతో అక్రమంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆయుర్వేద ఔషధాలు, సాంప్రదాయ మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తున్నారని విచారణలో బయటపడింది.
వైల్డ్లైఫ్ సంరక్షణ చట్టం ప్రకారం అలుగులను వేటాడటం, వాటి భాగాలను రవాణా చేయడం తీవ్ర నేరమని అధికారులు హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నలుగురిని హనుమకొండ అటవీ అధికారులకి అప్పగించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
👉 స్పష్టమైన హెచ్చరిక : వన్యప్రాణుల వేట లేదా భాగాల వ్యాపారం నేరమని, దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Post a Comment