మంత్రులతో కలిసి మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి
మేడారం మహాజాతర నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రివర్గ సహచరులతో కలిసి మేడారానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు మేడారం హరిత హోటల్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సందర్భంగా హరిత హోటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు రాత్రి మేడారంలోనే బస చేయనున్నారు. అనంతరం రేపు వన దేవతల గద్దెలను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు.

Post a Comment