మేడారం మహా జాతరకు ఏర్పాట్లు పూర్తి కోటి మంది భక్తుల రాకకు సర్వం సిద్ధం
ములుగు జిల్లా, జనవరి 24: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతరకు సుమారు కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రదేశాలు, ప్రయాణ ప్రాంగణాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన ఈ జాతరకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండగా, కొందరు నెల రోజుల ముందే గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు.
13 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు
జాతర సందర్భంగా శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ 25 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 13 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, వరంగల్ పోలీస్ కమిషనర్, రామగుండం సీపీ పర్యవేక్షణలో గద్దెలు, ట్రాఫిక్ నియంత్రణ, జాతర కోర్ ఏరియాలో భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలు, కృత్రిమ మేధ వినియోగం
గతంలో ఒకేసారి 2 వేల మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, ప్రాంగణం విస్తరణతో ఇప్పుడు ఒకేసారి 8–9 వేల మంది భక్తులు దర్శనం చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పునర్నిర్మాణంతో అన్ని గద్దెలు ఒకే వరుసలోకి రావడంతో భక్తుల రాకపోకలు సులభమయ్యాయి.
పార్కింగ్, బస్సులు, ఉచిత ప్రయాణం
రోడ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ సదుపాయాలు
మొబైల్ సిగ్నల్ సమస్య తలెత్తకుండా బీఎస్ఎన్ఎల్ 10 తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసింది.

Post a Comment