హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు
Hyderabad : నగర రవాణాలో మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM e-Drive Scheme కింద హైదరాబాద్కు మొత్తం 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్ను Convergence Energy Services Limited ఆధ్వర్యంలో ఈకేఏ మొబిలిటీ–గ్రీన్ సెల్ కన్సార్టియం అమలు చేయనుంది. నగర రవాణా అవసరాలకు అనుగుణంగా 100 మినీ బస్సులు, 815 12 మీటర్ల స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండటంతో ఈ బస్సులు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి. సురక్షితమైన, సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రయాణాన్ని అందించడంతో పాటు నగర వాసులకు మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనుభవాన్ని కలిగించనున్నాయి.

Post a Comment