అవినీతి కేసులో సూపరింటెండెంట్ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
ఖరీంనగర్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. Telangana Anti-Corruption Bureau (ఏసీబీ) అధికారులు జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ (WA) కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్ను కస్టడీలోకి తీసుకున్నారు.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 15, 2022 నుంచి సెప్టెంబర్ 20, 2023 మధ్యకాలంలో మధుసూదన్ మొత్తం ₹14,77,003 లంచాలను డిమాండ్ చేసి యూపీఐ (UPI) లావాదేవీల ద్వారా స్వీకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ లంచాలను స్వీకరించేందుకు ఆయన Bhadradri Co-operative Urban Bank Limited లోని ఒక బెనామీ ఖాతాను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
పరిశీలన మరియు ఆమోదం కోసం పెండింగ్లో ఉన్న ఫైళ్లలోని లోపాలను దాచడం లేదా సవరించడం వంటి అధికారిక ప్రయోజనాలు కల్పిస్తూ మధుసూదన్ తన అధికారాలను దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అవినీతి పై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్బుక్లో Telangana ACB, ఎక్స్లో @TelanganaACB మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు అందించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

Post a Comment