-->

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

హనుమకొండ, మే 25: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ (I&CAD)లో ప్రస్తుతం వరంగల్ జిల్లా పాలకుర్తి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంటి శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆయనను హనుమకొండ భవానీనగర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

ఫిర్యాదుదారుడు నిర్మించిన 10 డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్లకు సంబంధించిన ఎం-బుక్స్‌లో ఫైనల్ మెజర్‌మెంట్లు నమోదు చేసి, పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాసెస్ చేయడానికి ఈ లంచం కోరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనులను 2022 సెప్టెంబర్‌ నుంచి ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో ఉంచినట్లు ఏసీబీ తెలిపింది.

అధికారికి చెందిన వద్ద నుంచి రూ.50 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయన తన విధులను అక్రమంగా మరియు అవినీతిపరంగా నిర్వహించినట్లు నిర్ధారించారు.

నిందిత అధికారిని అరెస్ట్ చేసి వరంగల్‌లోని SPE & ACB ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ ( @Telangana ACB ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793